Header Banner

జగన్ కు పరిటాల సునీత వార్నింగ్.. నేడు రాప్తాడు వచ్చిన వైసీపీ అధినేత!

  Tue Apr 08, 2025 15:01        Politics

ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ రాప్తాడు రావడంపై టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్రస్థాయిలో స్పందించారు. పరామర్శలకు ఎలా వెళ్లాలో కూడా జగన్ కు తెలియదా? అని ప్రశ్నించారు. జై జగన్ అనిపించుకుంటూ పరామర్శకు వెళతారా? అని నిలదీశారు. ఇవాళ జగన్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలని అన్నారు. అబద్ధాలను పేపర్ పై రాసుకొచ్చి చదివారని విమర్శించారు. లింగమయ్య మరణాన్ని ఫ్యాక్షన్ మర్డర్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పులివెందులలో బాత్రూమ్ లో చంపుతారేమో కానీ, అనంతపురం జిల్లాలో అలాంటి హత్యలు జరగవని పరిటాల సునీత వ్యాఖ్యానించారు. "పోలీసులపై ఇష్టంవచ్చినట్టు మాట్లాడడమేంటి? పోలీస్ వ్యవస్థను అవమానించేలా జగన్ మాట్లాడారు. చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి జగన్ కు లేదు. జగన్ మాటలు పరిటాల కుటుంబాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయి. వాస్తవాలు తెలుసుకుని జగన్ మాట్లాడాలి" అని హితవు పలికారు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #ParitlaSunita #Jagan #CondolenceVisit #YCP #Comments #TDPMLA